కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలు
గాంధీభవన్లో మేడే వేడుకల్లో ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి విమర్శించారు. కార్మికులకు అన్యాయం చేసే కార్యక్రమాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆదివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో మే డే సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్ ఐఎన్టీయూసీ పతాకావిష్కరణ చేశారు.
అనంతరం ఐఎన్టీయూసీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రకాశ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. కార్మికులు జమ చేసుకున్న పీఎఫ్ డబ్బులపై పన్నులు వేస్తామని, వడ్డీ తగ్గించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తే దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యమించడంతో కేంద్రం తోక ముడిచిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఉత్తమ కార్మిక నేతలకు ఆయన సన్మానం చేశారు
మరిన్ని వార్తలు