అనారోగ్యంతో ఇద్దరి మృతి
హైదరాబాద్ క్రైం: కొత్తపేట మార్కెట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మృతిచెందారు. మార్కెట్కు సరుకులు రవాణాచేసే అనంతపురం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ రాముడు(52) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందాడు. అంతేకాకుండా మార్కెట్లో రోజుకూలిగా పనిచేసే కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనిల్(35) ఈ రోజు ఉదయం అనారోగ్యంతో చనిపోయాడు.