పోలీసుల కస్టడీకి రాజీవ్‌, శ్రావణ్‌


హైదరాబాద్‌: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్‌లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

 

రాజీవ్‌, శ్రావణ్‌లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top