రాష్ట్రంలో ఫాంహౌస్ పాలన సాగుతోంది

రాష్ట్రంలో ఫాంహౌస్ పాలన సాగుతోంది - Sakshi


టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ



 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఫాంహౌస్ పాలన కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ  విమర్శించారు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడతామన్నారు.  



 కేసీఆర్ కుటుంబంపై పోరాటం: మోత్కుపల్లి

 తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారంతా ప్రస్తుత ప్రభుత్వాన్ని చూసి లెంపలు వేసుకుంటున్నారని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ పరంగా కొన్ని పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. సెంటిమెంటు వల్లే ఆ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయామని విశ్లేషించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనమైన చరిత్ర తెలంగాణకు ఉందని, సీఎం కేసీఆర్ కుటుంబంపైనా పోరాడక తప్పదని మోత్కుపల్లి వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top