26, 27 తేదీల్లో టీటీడీపీ ఆందోళనలు


ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్



 సాక్షి,హైదరాబాద్: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ విమర్శించారు. ఈ విషయంలో సర్కారు నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు.



ప్రస్తుత వర్షాలతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో రహదారులు బాగుచేసి, ప్రజలకు తగిన సౌకర్యాలను కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top