11, 12 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ?


సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గానికి 200-250 మంది చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది ముఖ్యులను ఈ ప్లీనరీ సమావేశాలకు ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ముఖ్య కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై 2 రోజులపాటు వివరించాలని నిర్ణయించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా పార్టీ ముఖ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులను ఆహ్వానించనున్నారు. ఉపన్యాసకులుగా రిటైర్డు ఐఏఎస్‌లు, పార్టీ సీనియర్లు వ్యవహరించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top