కేటీఆర్కు సర్జరీ చేసిన వైద్యులు
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు శుక్రవారం వైద్యులు శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో రాళ్లను తొలగించారు. రెండు రోజుల పాటు కేటీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నిన్న సాయంత్రం సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన సొమ్మసిల్లి పడిపోవటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.