సైంధవుల్లా తయారయ్యారు: గువ్వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు సైంధవుల్లా తయారయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని విమర్శించారు. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నాడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన ఉత్తమ్, భట్టి వంటి కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.