బీజేపీ ఆందోళన: భారీగా ట్రాఫిక్ జాం
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఇంజాపూర్ వద్ద బజరంగ్దల్, బీజేపీ కార్యకర్తల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానికంగా ఉన్న రామచంద్ర డోంగ్రేజ్ మహారాజ్ గోశాలకు చెందిన షెడ్డును ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. శుక్రవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు ఈ రోజు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అడ్డుకోగా.. నిరసనకారులు పోలీసులకు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
మరిన్ని వార్తలు