ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల

ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల


హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పార్టీ బలోపేతం కోసం సోమవారం జలవిహార్లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాట్లను పొన్నాల పరిశీలించారు.


హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఎంఐఎంతో పొత్తు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై రేపటి సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంలోని సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరు హాజరవుతారని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top