టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌


విభజన సమస్యలపై చర్చ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో విభజన సమస్యలపై చర్చించనున్నారు.



అంబేద్కర్‌ యూనివర్సీటీ ప్రవేశపరీక్ష

నేడు జరగనున్న అంబేద్కర్‌ యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఏపీ, తెలంగాణల్లో 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17,026 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.



టీడీపీ నేతల దౌర్జన్యంపై ఆందోళనలు

రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం గన్‌మెన్‌పై దాడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో నేడు విజయవాడలో సమావేశం కానున్న రవాణా శాఖ నాన్‌ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌.



తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.



ఉగాది ఉత్సవాలు

కర్నూలు: నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. భృంగి వాహనంపై ఊరేగనున్న స్వామి దంపతులు. భారీగా తరలివస్తున్న భక్తులు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top