టుడే న్యూస్ డైరీ
ఐదో విడత పోలింగ్
ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్లో.. 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పీఎంతో పళనిస్వామి భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇవాళ ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. సీఎం పదవి చేపట్టిన తరువాత పళనిస్వామి తొలిసారి మోదీతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
► నేడు పేరవై పార్టీ కార్యవర్గం ప్రకటించనున్న దీప
► ఇవాళ ఏపీ ఐ సెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది.
► అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం ఇవాళ హైదరాబాద్కు చేరుకోనుంది.
► యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి.
► శ్రీశైలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు