నేటి ముఖ్యవార్తలు
నీళ్లు బంద్
నేడు విజయవాడ నగరవ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోనుంది. హెడ్ వాటర్ వర్క్స్లో విద్యుత్ మీటర్ల మార్పు కారణంగా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.
బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.
జాబ్ మేళా
ఇవాళ హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్లో మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. మధ్యహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ప్రచార ముగింపు
ఉత్తరప్రదేశ్లోని జరుగుతున్న సాధారణ ఎన్నికలకు ఐదో దశ ప్రచారం నేటితో ముగియనుంది. సోమవారం ఐదో దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార ముగింపుకు సిద్ధమవుతున్నాయి.
ఈ-ములాఖత్
నేడు చంచల్గూడ జైలులో ఈ-ములాఖత్ పథకం ప్రారంభం కానుంది. దీని ద్వారా ఖైదీలను కలవానుకునే వాళ్లు ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విజయ్హజారే ట్రోఫీ
నేటి నుంచి విజయ్హజారే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీని గుజరాత్ సొంత చేసుకుంది.
పొలిట్ బ్యూరో సమావేశం
ఇవాళ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తర్జనభర్జనలు జరగనున్నాయి.