టుడే న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్: ఆర్టీసి, విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ధర్నా.
► నేడు పుణెలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం
► జమ్ము కశ్మీర్: అనంతనాగ్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు
► గుంటూరు: ఇవాళ రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. నేలపాడు రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
► ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ టీపీసీసీ నిరసనలు
► మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు, రేపు ఏటిగడ్డ కిష్టాపూర్లో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి దీక్ష
► బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరో రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తెలుగురాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.
► ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి ఆయన చైనా పర్యటనకు బయలుదేరనున్నారు.
► నేటి నుంచి ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్లు ప్రారంభం. తొలిరోజు తెలుగు టైటాన్స్తో పూణే(రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం), యు ముంబాతో జైపూర్(రాత్రి 9గంటలకు ప్రారంభం) తలపడనున్నాయి.
► యూరో ఫుట్బాల్ టోర్నీలో నేటి నుంచి నాకౌట్ దశ మ్యాచ్లు. స్విట్జర్లాండ్తో పోలాండ్(సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం), వేల్స్తో నార్తర్న్ ఐర్లాండ్(రాత్రి 9:30 గంటలకు), పోర్చుగల్తో క్రొయేషియ(రాత్రి 12:30 గంటలకు) నేడు తలపడనున్నాయి.