నేడు నగర బంద్


అధికార టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, వివిధ ప్రజా సంఘాలు శనివారం బంద్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రభావం నగరంలోనూ కనిపించనుంది. 3,850కి పైగా సిటీ సర్వీసులు, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 1500 బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది.



ఆటో సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చిన దృష్ట్యా పాక్షికంగా అవీ నిలిచిపోయే  అవకాశం ఉంది. వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు యధావిధిగా నడుస్తాయని ద.మ. రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. - సాక్షి,సిటీబ్యూరో

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top