డివైడర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి


హైదరాబాద్ : మెదక్ జిల్లా పఠాన్చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాజేంద్ర నగర్ మండలం ఖానాపూర్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top