మీకు దొరికితే ఇచ్చేయరూ..!
∙ చోరీకి గురైన కాంక్లియర్ ఇంప్లాంట్ ప్రాసెసర్
∙ పరికరం లేక బాలుడి అవస్థలు
∙ దొరికితే అప్పగించాలని తల్లిదండ్రుల వేడుకోలు
శ్రీనగర్కాలనీ: తమ కుమారుడికి చెందిన కాంక్లియర్ ఇన్ప్లాంట్ చోరీకి గురికావడంతో అతను వినికిడి, మాట్లాడే శక్తి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, సదరు పరికరం దొరికితే తమకు అందజేయాలని బాధితుని తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే..వినికిడి శక్తి లేక, మాట్లాడలేని చిన్నారులకు, వినికిడి యాంత్రాలు సైతం పనిచేయక పోతే వైద్యులు. కాంక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా మాట్లాడే స్థితికి తీసుకొస్తారు. ఇందుకుగా రూ.9 నుండి 12 లక్షలు ఖర్చవుతుంది. సర్జరీ తర్వాత సదరు పరికరం అతనికి తప్ప మరొకరికి ఉయోగపడదు.
జగదీష్ అనే బాలుడికి గతేడాది సర్జరీ చేసిన వైద్యులు ఇంప్లాంట్ను అమర్చగా, అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ నెల 2న అతను తల్లిదండ్రులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి వెళుతుండగా అతని తల్లి పర్సు చోరీకి గురికాగా, అందులో బాలుడి ఇంప్లాట్ ప్రాసెసర్ ఉంది. అప్పటినుంచి జగదీష్ వినలేక, మాట్లాడలేక పోతున్నాడు. కాంక్లియర్ ఇప్లాంట్ ప్రాసెసర్ ఎవరికైనా కనబడినా, దొరికినా శ్రీనగర్కాలనీలోని తమ సంస్థను సంప్రదించాలని ఆశ్రయ్–ఆకృతి స్వచ్చంద సంస్థ డైరెక్టర్ డీపీకే బాబు కోరుతున్నారు. బాలుడికి ఇంప్లాట్ లేక ఇబ్బందులు పడుతున్నందున, ఆచూకీ తెలిసిన వారు 9100779276 , 040–40042250 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.