చిక్కడపల్లిలో చోరీ
చిక్కడపల్లిలోని వివేక్నగర్ పార్క్ వద్ద నున్న ప్రొఫెసర్ శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ.20 వేల నగదు చోరీ అయినట్లు యజమాని తెలిపారు.