సామాజిక శాస్త్రాలపై అధ్యయనం సాగాలి
అమెరికా కాన్సల్ జనరల్ మైఖేల్ ములిన్స్
రాయదుర్గం: సామాజిక శాస్త్రాలపై మరింతగా అధ్యయనం సాగాలని అమెరికా కాన్సల్ జనరల్ మైఖేల్ ములిన్స్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో శుక్రవారం రాత్రి సెంటర్ ఫర్ సోషల్ సైన్స్(సిఎస్ఎస్) ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైఖేల్ ములిన్స్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో మిగతా సైన్స్, టెక్నాలజీ కోర్సుల కంటే సామాజిక శాస్త్రాల అవసరం కనిపిస్తోందన్నారు. పాశ్చాత్య దేశాలు సైతం సోషల్ సెన్సైస్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ సోషల్ సెన్సైస్ వ్యవస్థాపకులు అమెషా రుబినా మాట్లాడుతూ మూడు నెలల డిప్లామా కోర్సు కొనసాగుతోందన్నారు. పదో తరగతి పాసైనవారు అర్హులన్నారు.
ఐఎస్బిలో ఆన్లైన్ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తామని, ప్రతి శనివారం వివిధ అంశాలపై ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బ్రిటీష్ హైకమిషన్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ మ్యాకలిస్టర్, యూఎన్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఫర్ పీస్ న జీబ్, ఇఫ్లూ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ సునైనాసింగ్, బియింగ్ ఉమెన్ వ్యవస్థాపకులు రుచికాశర్మ, విద్యావేత్త అసదుల్లా పాషా, మాజీ ఐఏఎస్ అధికారి ఐడి పాసా, సీఎస్ఎస్ డెరైక్టర్ వి,షా పాల్గొన్నారు.