రుణమాఫీలో ప్రభుత్వం విఫలం: రావుల
హైదరాబాద్: రైతులకు రుణమాఫీ నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. రైతులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ గన్ఫౌండ్రీలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్ రుణమాఫీ బకాయిలను విడుదల చేయాలని రావుల డిమాండ్ చేశారు. అనంతరం ఎస్బీఐ జీఎంకు వినతిపత్రం సమర్పించారు. రైతులకు రుణాలు ఎందుకు మంజూరు చేయడం లేదని బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్లే మంజూరు చేయలేకపోతున్నామని మేనేజర్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.