నార్సింగిలో కాల్పుల కలకలం


హైదరాబాద్: నార్సింగి మండలం గండిపేట్‌లో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. గండిపేట్ గ్రామ సర్పంచి ప్రశాంత్ ఇంటికి వచ్చిన ఆయన బంధువు వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌గౌడ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, అది మిస్ ఫైరా? కావాలనే కాల్చాడా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top