ఓయూసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు


హైదరాబాద్: ఓయూసెట్-2015 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. అపరాధ రుసుముతో ఈ నెల 22తో గడువు ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇంత వరకు 1.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top