రిమ్స్ డైరెక్టర్పై కేసు నమోదు
దేశ చిత్రపటంపై నిలబడి స్వతంత్ర వేడుకలు జరిపినందుకు..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ అశోక్కుమార్పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన భారతదేశ చిత్రపటంపై నిలబడి వేడుకలు నిర్వహించినందుకుగానూ ఆయనపై దేవేందర్ అనే వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భారతదేశ గౌరవాన్ని అవమానించినందుకుగాను సెక్షన్–2 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సెల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్–1971 కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ స్వామి తెలిపారు.