యువకుడి దారుణహత్య
నగరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డలో పెయింటర్గా పనిచేస్తున్న అహ్మద్(28) అనే యువకుడిని హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో అతని పై దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.