ఎల్బీనగర్లో దారుణ హత్య
నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. బండరాళ్లతో మోది హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని మెట్రో పిల్లర్ల కింద పడేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు ఉండడంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. పోలీసులు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.