వ్యాపారి దారుణ హత్య
నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. చంపాపేటలో ఫ్రెండ్స్ క్లబ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న బాబురావు అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం భాస్కర వైన్స్ సమీపంలో కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.