ఇది భూములు లాక్కునే ప్రభుత్వం

ఇది భూములు లాక్కునే ప్రభుత్వం - Sakshi


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

గోవిందరావుపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు భూములివ్వకుండా ఉన్నవి లాక్కు నేదిగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావు పేట మండలం మచ్చాపూర్‌లోకి ప్రవేశించింది. 



తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే కష్టాలే ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎన్ని కలకు ముందు అనేక వాగ్దానాలు చేశారని, వాటిని అమలు చేయ డంలో శ్రద్ధ చూపడం లేదని విమ ర్శించారు. పాదయాత్ర సంద ర్భంగా ప్రజలు ఇచ్చిన ప్రతీ దర ఖాస్తును ప్రభుత్వం వరకు చేర్చి సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. తమ్మినేని పాదయాత్రకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, తుడుందెబ్బ, గీతకార్మిక సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top