ధూల్పేట్లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని ధూల్పేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శనివారం తెల్లవారుజామున నుంచి ధూల్పేట్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.