సునీత ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణం
హైదరాబాద్ : మాదాపూర్లో కలకలం రేపిన టెలికాలర్ సునీత మృతికేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని నిర్ధారించారు. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు.
గచ్చిబౌలిలో టెలికాలర్గా పనిచేసే ప్రియుడిని భాగ్యనగర్ సొసైటీ రోడ్డులో సునీత తరచుగా కలిసేది. అతడ్ని పెళ్లి చేసుకోవాలని సునీత కోరడంతో గత కొంతకాలంగా ఆమెను దూరం పెట్టాడు. వాలెంటైన్స్ డే నాడు ప్రియుడు కలిసేందుకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
సంబంధించిన వార్తలు
టెలికాలర్ సునీతది ఆత్మహత్య?