2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ


హైదరాబాద్ :  2018 నాటికి తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రం అవుతుందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని... కానీ విద్యుత్ అంతరాయం ఉందని ఆయన స్పష్టం చేశారు.


ట్రాన్స్ఫార్మర్ పాతపడటం లేకుంటే వీధి లైట్లు పాడవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నకు జగదీశ్రెడ్డి పై విధంగా సమాధానం చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top