రేపు లాయర్ల ‘ఛలో హైదరాబాద్’


హైదరాబాద్: తెలంగాణ లాయర్ల జేఏసీ శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటంపై గత కొన్ని రోజులుగా లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 11 మంది జడ్జిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయాలని టీ అడ్వకేట్స్ జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టే ఆందోళనకు పెద్ద ఎత్తున హాజరు కావాలని లాయర్లను కోరింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top