నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ దీక్షలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఆదివారం విందు ఏర్పాటు చేసింది.
ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతోపాటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.