'రెండు రోజుల్లో నిధులు వాపస్'
సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ.1250 కోట్లను రెండ్రోజుల్లో తిరిగి ఇవ్వడానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జెట్లీ అంగీకరించినట్టుగా కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. తెలంగాణ నుంచి తీసుకున్న నిధులను వెంటనే విడుదల చేయడానికి అరుణ్జెట్లీ సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రెండ్రోజుల్లో విడుదల చేస్తారని వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి జెట్లీతో మాట్లాడినట్టుగా వెంకయ్య వివరించారు.