ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష

ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష - Sakshi


హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దాంతో  ప్రభుత్వ తీర్మానాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ఆందోళన చేపట్టారు. 


 


ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్... ఎన్టీఆర్ పేరును అవమానపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.  తీర్మానాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోత్కుపల్లితో పాటు పలువురు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top