ప్రభుత్వ భూములను కాపాడండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం లేఖ రాశారు.
హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న వేలఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. వీటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.