స్కూల్‌ మార్చారని విద్యార్థిని ఆత్మహత్య..

స్కూల్‌ మార్చారని విద్యార్థిని ఆత్మహత్య.. - Sakshi

యాకుత్‌పురా: స్కూల్‌ మార్చినందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవింద్‌స్వామి తెలిపిన వివరాల ప్రకారం.... యాకుత్‌ఫురా ఎస్సార్టీ కాలనీకి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ సయీద్‌ కుమార్తె కతీజా ఫాతిమా (14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

 

గతేడాది పురానీహవేలిలోని ప్రిన్సెస్‌ ఎసైన్‌ పాఠశాలలో చదువుతున్న ఫాతిమాను కుటుంబ సభ్యులు ఇటీవల సంతోష్‌నగర్‌లోని రాయల్‌ ఎంబసీ స్కూల్‌లో చేర్పించారు. దీంతో మనస్థాపానికి గురైన ఫాతిమా మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top