సీఐడీ ఐజీగా సౌమ్యా మిశ్రా
హైదరాబాద్: నేర విచారణ విభాగం (సీఐడీ) ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా డాక్టర్ సౌమ్యామిశ్రా (ఐపీఎస్) నియమితులయ్యారు. అదే విధంగా ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పరిపాలన డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న కల్పనా నాయక్, ఐపీఎస్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) జాయింట్ డెరైక్టర్గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.