తండ్రినే చంపేశాడు

తండ్రినే చంపేశాడు - Sakshi


విజయనగర్‌కాలనీ: ఓ వ్యక్తి అమానుషంగా కన్నతండ్రినే గొంతునులిమి చంపేశాడు. ఈ సంఘటన అసిఫ్‌నగర్‌పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగింది. నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. శనివారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ మహ్మద్ గౌస్ మొహియుద్దీన్, ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు..  ఎయిర్ ఇండియా విశ్రాంత ఉద్యోగి కడ్చర్ల మదన్‌మోహన్‌రావు(72) గుడిమల్కాపూర్ శివాలయం వెనుక వినార్ సుహాని ఎన్‌క్లేవ్స్ అపార్‌‌టమెంటులోని ఓ ఫ్లాటులో కుమారుడు సుబ్రహ్మణ్యం(40)తో కలిసి నివసిస్తున్నాడు.  



మద్యానికి బానిసైన సుబ్రహ్మణ్యం సెక్యూరిటీగా పనిచేస్తున్న చోట ఓ వివాహిత మహిళ(44)తో  వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకొని రాగా తండ్రి అభ్యంతరం తెలిపాడు. దీంతో సుబ్రహ్మణ్యం తండ్రిపై కక్ష పెంచుకొని వంటవాడిగా పని చేసే గుడిమల్కాపూర్‌కు చెందిన అతని స్నేహితుడు నర్సింగ్‌రావుతో కలిసి అక్టోబరు 19నరాత్రి 9:30 గంటల ప్రాంతంలో హత్య చేశాడు.



అనంతరం తన తండ్రికి ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, బీపీ, షుగర్ లెవల్స్ పెరగడంతో మృతి చెందాడని బంధుమిత్రులకు తెలిపాడు. మృతుని మెడపై గాయాలు కనబడడంతో మదన్‌మోహన్ బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. కుమారుడు సుబ్రహ్మణ్యం తండ్రి మోహన్‌రావు చేతులు, నోరు మూసి గట్టిగా పట్టుకోగా అతడి స్నేహితుడు నర్సింగ్‌రావు గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఇన్‌స్పెక్టర్ కేపీ. రాజరాజేశ్వర్, ఎస్‌ఐ గౌస్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top