ఎన్నో బాధలు పడ్డాం: నాయిని


అబిడ్స్: తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు ఉద్యమకారులను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుమ్మెరాత్‌బజార్‌లో అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఉద్యమం, అమరవీరుల త్యాగఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్ మాట్లాడుతూ... గోషామహల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top