కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే: దాసరి

కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే: దాసరి


కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తానిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తనను కలిసిన అనంతరం దాసరి మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానన్నారు.



కాపు ఉద్యమంపై మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కల్పించినది చంద్రబాబేనని ఈ సందర్భంగా ముద్రగడ అన్నారు. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని, ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు. తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని, ఏ కులానికీ తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తాను నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటానని, కాపు ఉద్యమానికి మద్దతిచ్చే ప్రతి నేతను కలుస్తానని అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top