ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top