‘కేసీఆర్కు అనుభవం లేదని రుజువైంది’
హైదరాబాద్సిటీ: కేసీఆర్కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని అన్నారు.
అబద్ధాలు ధైర్యంగా, అందంగా చెప్పడంలో కేసీఆర్ పాస్ అయ్యారని చెప్పారు. అయితే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాస్తా చీకట్ల తెలంగాణాగా మారిపోయిందన్నారు.