కేసీఆర్ భాష అధ్వానం: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: ‘తేల్చుకుందాం రా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మాట్లాడుతున్న భాష, పదజాలం ఏ మాత్రం హుందాగా లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డితో కలసి శనివారం మాట్లాడుతూ.. అన్పార్లమెంటరీ భాషను వాడిన కేసీఆర్ తన పదజాలాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు జైళ్లు కొత్త కాదని, స్వాతంత్య్రం తెచ్చిన ఘనత తమ పార్టీదేనని గుర్తుచేశారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి చూడాలని షబ్బీర్అలీ సవాల్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేలా మైండ్ గేమ్ ఆడుతూ..
ప్రజల సమస్యలను మరుగున పడేయడం, చర్చలకు రాకుండా పబ్బం గడుపుకొనేందుకే రెచ్చగొట్టే పదజాలాన్ని సీఎం వాడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం ఒక్క రోజుకే అసెంబ్లీ సమావేశాలు పరిమితం చేయకుండా కనీసం 15 రోజుల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు.