'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు'


శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. వినాయకచవితి, బక్రీద్ పండగల సందర్భంగా శంషాబాద్ డీసీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం డివిజన్ స్థాయి శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి, బక్రీద్ పండగలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గోవులను రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top