క్యాంపస్‌లో అర్థనగ్నంగా పరిగెత్తించారు

క్యాంపస్‌లో అర్థనగ్నంగా పరిగెత్తించారు


హైదరాబాద్‌: ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పదేపదే అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలవరం రేపుతోంది. తాజాగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌ ఘటన విద్యార్థులను విస్తుపోయేలా చేసింది. రాఘవేంద్ర అనే బీటెక్‌ విద్యార్థిని సీనియర్లు తీవ్ర వేధింపులకు గురిచేశారు.



అర్థరాత్రి వేళ క్రూరంగా ప్రవర్తించిన సీనియర్‌ విద్యార్థలు.. జూనియర్‌ విద్యార్థి రాఘవేంద్రను అర్థనగ్నంగా క్యాంపస్‌లో పరుగులు పెట్టించారు. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు సీనియర్ల తీరుకు నిరసనగా క్యాంపస్‌లో ఆందోళన బాట పట్టారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top