నేడు సాక్షి టీవీలో జియో బీ ఫైనల్స్

నేడు సాక్షి టీవీలో జియో బీ ఫైనల్స్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: సాక్షి ఇండియా జియో బీ 2015 పోటీల తొలి ఎడిషన్ ఫైనల్స్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాక్షి టీవీలో వీక్షించవచ్చు. ఈ పోటీల ప్రిలిమినరీ రౌండ్ జనవరి 24న ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి క్యాంపస్‌లో, ప్రీ ఫైనల్స్ ఫిబ్రవరి 1న బాచుపల్లి క్యాంపస్‌లో జరగడం తెలిసిందే. లిఖితపూర్వక-మౌఖిక పద్ధతిన జరిగిన ఈ పరీక్షల్లో నగరవ్యాప్తంగా పలు స్కూళ్ల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులు ఫైనల్స్‌కు చేరుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top