రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత


హైదరాబాద్‌:  శంషాబాద్ విమానాశ్రయం కార్గో నుంచి మలేషియా వెళ్తున్న లగేజిలో ఎపిడ్రిన్  అనే మత్తుపదార్థం(డ్రగ్‌) ఉన్న కస్టమ్స్‌ అధికారుల సోదాల్లో గురువారం బయటపడింది. ఈ డ్రగ్స్‌ను చిన్న పిల్లల బ్యాగులో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు.  35 బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నార్కొటిక్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి  సింగపూర్, హంకాంగ్, శ్రీలంక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top