రోహిత్ను క్షేమంగా వదిలేసిన కిడ్నాపర్లు
హైదరాబాద్ : హైదరాబాద్ కుషాయిగూడలో కిడ్నాప్నకు గురైన రోహిత్ మిస్టరీ వీడింది. కిడ్నాపర్లు రోహిత్ను అతని ఇంటివద్దే వదిలి వెళ్లిపోయారు.
ఏఎస్ రావు నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రోహిత్ను గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాపర్లు అపహరించుకు వెళ్లారు. రోహిత్ను విడుదల చేసేందుకు కిడ్నాపర్లు రూ. పది లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు రోహిత్ ఆచూకీ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో రోహిత్ను క్షేమంగా విడిచిపెట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.