జవహర్‌నగర్‌లో చోరీ


హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ, వాయుశక్తి నగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచరాణ చేపడుతున్నారు. బంగారు నగలు, నగదు, ఎల్సీడీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ లతో పాటు గృహోపకరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top