ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆంధ్రాబ్యాంకులో చోరి యత్నం జరిగింది. వినయ్నగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు శాఖ భవనం అద్దాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. లోపల షట్టర్లు ఉండటంతో వీలుపడక దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.